Monday, 11 May 2026

Blog

ఖమ్మం

కలెక్టర్ మరియు ఎ సి పి లకి వినతి పత్రం సమర్పించిన బిజెపి బృందం

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) గత రెండు రోజుల క్రితం ఖమ్మం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన ఇజ్రాయిల్ హమాస్ పై చేస్తున్న దాడులను నిరసిస్తూ. హమాస్ అనుకూల ర్యాలీలో వివిధ పాఠశాల ల పిల్లలను ర్యాలీలో పాల్గొనేలా చేసిన ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఖమ్మం జిల్లా కలెక్టర్ మరియు మరియు ఏసిపి కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యక్రమం లో పాల్గొన్నట్లుగా ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఈ ర్యాలీ లో పాల్గొనడం సరైనది కాదన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, మండదపు సుబ్బారావు, దేవకీ వాసుదేవరావు, నున్నా రవికుమార్,సన్నే ఉదయ్ ప్రతాప్ ఆచంటి కోటేశ్వరరావు, అల్లిక అంజయ్య,వేల్పుల సుధాకర్ ధనియాకుల వెంకట్ నారాయణ, నరేష్, భద్రం తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి – అదనపు ఎస్పీ..

అన్నమయ్య జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) జిల్లా ఎస్పీ. శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ,. ఆదేశాల మేరకు, ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం.వెంకటాద్రి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగాపరిష్కరించాలని, జిల్లా ఎస్.పి, శ్రీ. వి.విద్యాసాగర్ నాయుడు ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం.వెంకటాద్రి గారు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ గారి ఆధ్వర్యంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి అదనపు ఎస్పీ గారు నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను ముఖాముఖి మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి, వారి సమస్యలను పరిష్కరిస్తామని అదనపు ఎస్పీ గారు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సదరు  ఫిర్యాదులను  “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం.వెంకటాద్రి తెలిపారు.

చిత్తూరు

చిత్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు.

చిత్తూరు జిల్లా AR పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ ఎస్‌.ఆర్‌. రాజశేఖర రాజు, డి.టి.సి. డి.ఎస్పీ జె. రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల 45 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో చీటింగ్‌ 1, కుటుంబ తగాదాలు 9, వేదింపులు 3, ఇంటి తగాదాలు 6, భూ తగాదాలు 16, డబ్బు తగాదాలు 8, దారి తగాదాలు 2 ఉన్నాయి. ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయండి: మంత్రి అనిత

రాష్ట్రంలో ఎల్లుండి నుంచి 4 రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్దా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

అన్నమయ్య

ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరికీ తీవ్ర గాయాలు

రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం, మంగంపేట బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద సోమవారం ఉదయం పల్సర్ బైక్, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే వారిని ఆంబులెన్స్ లో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చిత్తూరు

*పలమనేరు క్రీడాకారిణి అక్షయకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్*

పలమనేరుకు చెందిన రగ్బీ క్రీడాకారిణి అక్షయకు పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. బీహార్ వేదికగా ఈ నెల 9,10 తేదీలలో జరిగిన ఏషియా రగ్బీ ఎమిరేట్స్ అండర్-20 ఛాంపియన్‌షిప్ లో చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన నర్రా సురేష్, శ్రీదేవిల కుమార్తె అక్షయ రగ్బీ క్రీడాకారిణి భారత జట్టు తరపున ఆడి కాంస్య పతకం సాధించింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఛాంపియన్‌షిప్ లో ఆమె కనబరిచిన ప్రదర్శన క్రీడల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని కనబరుస్తున్నదన్నారు. పట్టుదల, కఠోర శిక్షణ, ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన అక్షయ నేటి యువతరానికి ఆదర్శమని భవిష్యత్తులో మరింత అత్యుత్తమంగా రాణించి ఈ ప్రాంతానికి పేరును తీసుకురావాలాని కోరుతూ ఆమెకు ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా అక్షయను ప్రోత్సహించి ఆమె ఎదుగుదలకు కృషి చేసిన వారి తల్లిదండ్రులకు సైతం ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

సిక్కోలు స్వచ్చంధ సేవా సమితి నుండి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం

(శ్రీకాకుళం రూరల్) శ్రీకాకుళం నియోజకవర్గంలోని కిష్టప్పపేట గ్రామానికి చెందిన ముద్దాడ చిన్నమ్మడు అనే మహిళకు సిక్కోలు స్వచ్చంధ సేవా సమితి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. నెల క్రితం మెడ ఎముక విరిగిపోవడంతో స్థానిక జేమ్స్ హాస్పిటల్‌లో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో చిన్నమ్మడు కన్నవారి ఇంట్లో ఉంటున్నారు. డిగ్రీ చదువుతున్న ఒక కొడుకు ఉన్నారు. తండ్రి ఇటీవలే మృతి చెందడంతో, ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి. మందులు, వైద్యానికి కూడా డబ్బులు సరిగా అందకపోవడంతో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిక్కోలు స్వచ్చంధ సేవా సమితి సభ్యులు, సోమవారం ఆమెకు 15 వేల రూపాయల సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బరాటం చంద్రశేఖర్, పరంకుశం జగదీష్, శింతు ఆటకేశం, పొడుగు చరణ్ పాల్గొన్నారు.

భక్తి

సూర్యాపేట పట్టణంలో బోనాల సందడి

సూర్యాపేట :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) సూర్యాపేట పట్టణంలో ఆదివారం (10ఆగస్ట్ 2025) నాడు బోనాల పండుగ సంబరం అత్యంత వైభవంగా జరిగింది. రాఖి పండుగకి పుట్టినింటికి వచ్చిన ఆడబిడ్డలకి బోనస్ గా బోనాల పండుగను పుట్టినింటిలో జరుపుకునే అదృష్టం కలిగింది. కానీ బోనాలు జరిగే దేవాలయ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రతను గాలికి వదిలేసారు. కనీసము భక్తులు ఇచ్చే కానుకలతోనైనా దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేటట్లు ఆలయ పాలకమండలి సభ్యులు మరియు అధికారులు కృషి చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

10.08.25 (పున్నమి ప్రతినిధి) CBSE రెండు తెలుగు రాష్ట్రాల ఘనంగా ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా.

ఈనెల 5వ తేదీ నుండి10 వ తేదీ వరకు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అక్షర విద్యాలయం నందు జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల CBSE అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా జరిగినవి. రెండు రాష్ట్రాల క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీలలో తన ప్రతిభను చాటిన మియాపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 10 తరగతి విద్యార్థిని వయసు 10 సంవత్సరములు 3000ms పరుగు పందెము లోRunner గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరచినది ఆ విద్యార్థిని తల్లిదండ్రులను, cocher( కోచర్) గారిని సత్కరించారు.END

ఖమ్మం

ఫాస్ట్ ట్యాగ్ వాహనదారులు కి శుభవార్త.. ఇక టోల్ ఛార్జ్ 15/-.ఆగష్టు 15 నుండి అమలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న జూన్ 18న ఒక కీలక ప్రకటన చేశారు. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రారంభం గురించి తెలియజేశారు. ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ వాహనదారులకు చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ పాస్ ద్వారా డ్రైవర్లు కేవలం రూ. 15కే టోల్ ప్లాజాను దాటగలరని, ఇది ప్రస్తుత ఖర్చు కంటే చాలా తక్కువ అని గడ్కరీ అన్నారు. *వార్షిక ఫాస్ట్‌ ట్యాగ్‌ పాస్‌ ధర రూ.3000* వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రయోజనాలను వివరిస్తూ నితిన్ గడ్కరీ ఈ పాస్ ధర రూ.3000గా నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో వాహనదారులు 200 ప్రయాణాలు చేయవచ్చని చెప్పారు. ఇక్కడ ‘ఒక ప్రయాణం’ అంటే ఒక టోల్ ప్లాజాను దాటడం. ఈ లెక్క ప్రకారం.. రూ.3000కి 200 టోల్‌లను దాటడం అంటే టోల్‌కు కేవలం రూ.15 మాత్రమే ఖర్చవుతుందని అన్నారు. సాధారణంగా, మీరు ఏదైనా టోల్ ప్లాజా గుండా ఒకసారి వెళ్ళడానికి సగటున రూ.50 చెల్లిస్తే, 200 టోల్ ప్లాజాలను దాటడానికి మీరు మొత్తం రూ.10,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వార్షిక FASTag పాస్‌ని ఉపయోగించడం ద్వారా మీరు నేరుగా రూ.7000 వరకు ఆదా చేయవచ్చు. *వార్షిక పాస్ ప్రయోజనాలు:* కొత్త వార్షిక FASTag పాస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న FASTagను తరచుగా రీఛార్జ్ చేసుకోవాలి. అయితే వార్షిక పాస్‌ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. దాని చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత మీరు దానిని మళ్ళీ పునరుద్ధరించాలి. ఈ వార్షిక పాస్ జారీ చేసిన తర్వాత ప్రజలు టోల్ చెల్లించడానికి పొడవైన క్యూలలో నిలబడే ఇబ్బంది నుండి కూడా బయటపడతారు. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ఆగస్టు 15, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే ఇది జాతీయ రహదారులపై మాత్రమే చెల్లుతుంది. రాష్ట్ర రహదారులపై దీని ఉపయోగం చెల్లదు. ఈ చొరవ రవాణాను మరింత సౌకర్యవంతంగా, ఆర్థికంగా మారుస్తుందని భావిస్తున్నారు. *FASTag వార్షిక పాస్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి* ఆగస్టు 15 నుండి ఇప్పటికే ఉన్న FASTag వినియోగదారులు వార్షిక FASTag పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాజ్‌మార్గ్ యాత్ర యాప్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారిక వెబ్‌సైట్ (www.nhai.gov.in) లేదా www.morth.nic.in లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. *ఇది తప్పనిసరియా?* ప్రతి ఒక్కరూ FASTag వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదా? ప్రతి ఒక్కరూ FASTag వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదు. అయితే, రోజువారీ ప్రయాణికులు చెల్లించే టోల్ ఛార్జీలను తగ్గించడం దీని లక్ష్యం. వార్షిక పాస్ కొనడానికి ఇష్టపడని వారికి, వారి ప్రస్తుత FASTag యథాతథంగా పనిచేస్తుంది. టోల్ ప్లాజాలలో వర్తించే విధంగా వినియోగదారులు దీనిని సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.