నంద్యాల: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. శుక్రవారం నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు
ప్రజా సమస్యలపై మంత్రి ఫరూక్ ప్రత్యేక దృష్టి
నంద్యాల: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. శుక్రవారం నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు

