సంగం సర్కిల్ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సంగం సీఐ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాంమండపం ఏర్పాటు చేసుకునే ముందు సంబంధిత అధికారుల నుంచి ఆన్లైన్లో అనుమతి తప్పనిసరిగా పొందాలి. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
రహదారులను ఆక్రమించి ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా మండపాలు ఏర్పాటు చేయరాదు.
విద్యుత్ షార్ట్సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా వైరింగ్, విద్యుత్ కనెక్షన్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతి మండపం వద్ద అగ్నిమాపక పరికరాలు, నీటి సౌకర్యం అందుబాటులో ఉంచాలినిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు, లౌడ్స్పీకర్లు వినియోగిస్తే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
మండపాల వద్ద నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్వాహకుల బాధ్యత ఉంటుంది.
పోలీసు అధికారులు సూచించిన నిమజ్జన ప్రాంతాలు, చెరువుల్లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి పోలీసులకు సహకరించాలని సీఐ శ్రీనివాసరెడ్డి నిర్వాహకులకు సూచించారు.

సంగం సర్కిల్ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటుచేసే నిర్వాహకులకు సంగం సీఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరికలు ముఖ్య సూచనలు
సంగం సర్కిల్ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సంగం సీఐ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాంమండపం ఏర్పాటు చేసుకునే ముందు సంబంధిత అధికారుల నుంచి ఆన్లైన్లో అనుమతి తప్పనిసరిగా పొందాలి. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రహదారులను ఆక్రమించి ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా మండపాలు ఏర్పాటు చేయరాదు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా వైరింగ్, విద్యుత్ కనెక్షన్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మండపం వద్ద అగ్నిమాపక పరికరాలు, నీటి సౌకర్యం అందుబాటులో ఉంచాలినిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు, లౌడ్స్పీకర్లు వినియోగిస్తే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మండపాల వద్ద నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్వాహకుల బాధ్యత ఉంటుంది. పోలీసు అధికారులు సూచించిన నిమజ్జన ప్రాంతాలు, చెరువుల్లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాలి. ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి పోలీసులకు సహకరించాలని సీఐ శ్రీనివాసరెడ్డి నిర్వాహకులకు సూచించారు.

