Thursday, 3 September 2026
  • Home  
  • నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి

మర్రిపాడు: మండలంలోని కండ్రిక సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇథియోస్ కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు సమాచారం. నిద్రమత్తు కారణంగానే డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిద్రమత్తులో వాహనాలు నడపవద్దని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.

మర్రిపాడు: మండలంలోని కండ్రిక సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇథియోస్ కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు సమాచారం. నిద్రమత్తు కారణంగానే డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిద్రమత్తులో వాహనాలు నడపవద్దని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.