వర్ల రామయ్య గారికి తంగిరాల సౌమ్య గారు శుభాకాంక్షలు
మైలవరం ఎన్టీఆర్ జిల్లా పున్నమి న్యూస్.
శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వక భేటీ – నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నేతలతో కలిసి అభినందనలు..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మర్యాదపూర్వకంగా కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడ భవానిపురంలోని వర్ల రామయ్య గారి స్వగృహానికి వెళ్లిన తంగిరాల సౌమ్య గారు, నందిగామ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఆయనను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన వర్ల రామయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో, సామాజిక న్యాయం కోసం ఆయన అందిస్తున్న సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న వర్ల రామయ్య గారికి శాసన మండలి సభ్యత్వం లభించడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని ఆమె తెలిపారు. శాసన మండలిలో వర్ల రామయ్య గారి అనుభవం, ప్రజా సమస్యలపై ఉన్న అవగాహన రాష్ట్రానికి మరింత ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ మర్యాదపూర్వక భేటీలో నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొని వర్ల రామయ్య గారికి శుభాకాంక్షలు తెలిపారు.




