Tuesday, 1 September 2026
  • Home  
  • స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డుల్లో PGRS సేవలు తప్పనిసరి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డుల్లో PGRS సేవలు తప్పనిసరి

అమలాపురం, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు (SGSW) కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సేవలను అన్ని పని దినాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, ఐ.ఏ.ఎస్. అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులతో సచివాలయాలకు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి, ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ సహాయకులు, సర్వే సహాయకులు, రెవెన్యూ సహాయకులు, పశుసంవర్ధక శాఖ సహాయకులు, ఇంజినీరింగ్ సహాయకులు తదితర స్పెసిఫిక్ ఫంక్షనరీలు నిర్ణీత సమయంలో తమ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉన్న సిబ్బంది సైతం నిర్ణీత సమయంలో PGRS సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. అయితే ఇతర అధికారిక విధులకు డెప్యుటేషన్‌పై వెళ్లిన సిబ్బందికి ఈ ఆదేశాలు వర్తించవని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సత్వరంగా పరిష్కరించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, సమర్థవంతంగా అందించేందుకు అన్ని శాఖల అధికారులు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.

అమలాపురం, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు (SGSW) కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సేవలను అన్ని పని దినాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, ఐ.ఏ.ఎస్. అధికారులను ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులతో సచివాలయాలకు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి, ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ సహాయకులు, సర్వే సహాయకులు, రెవెన్యూ సహాయకులు, పశుసంవర్ధక శాఖ సహాయకులు, ఇంజినీరింగ్ సహాయకులు తదితర స్పెసిఫిక్ ఫంక్షనరీలు నిర్ణీత సమయంలో తమ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి విధుల్లో ఉన్న సిబ్బంది సైతం నిర్ణీత సమయంలో PGRS సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. అయితే ఇతర అధికారిక విధులకు డెప్యుటేషన్‌పై వెళ్లిన సిబ్బందికి ఈ ఆదేశాలు వర్తించవని తెలిపారు.
ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సత్వరంగా పరిష్కరించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, సమర్థవంతంగా అందించేందుకు అన్ని శాఖల అధికారులు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.