*ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూడ వెంకటేష్ ఆధ్వర్యంలో నందిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.*
*ఈ సందర్భంగా దూడ వెంకటేష్ మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. యువత, సాంకేతిక రంగం మరియు దేశ ప్రగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.*
*ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళారపు తుక్కన్న, ద్యావతి లింగం, తమ్మల దేవేందర్, నర్సయ్య, అక్బర్, అజర్, విజయ్ రాజు, నసీర్, పవన్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…



