సెప్టెంబర్ 1 నుంచి భారత విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల బోర్డింగ్ పాస్లపై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయనుంది. ఇకపై ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు ఎలక్ట్రానిక్ లేదా ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ను చూపించవచ్చు. మొబైల్లోని ఈ-బోర్డింగ్ పాస్లను కూడా అధికారులు అంగీకరిస్తారు. భౌతికంగా స్టాంప్ వేయడం వల్ల ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై విమానాశ్రయ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. కొత్త విధానంతో అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. అలాగే బోర్డింగ్ పాస్లపై స్టాంపింగ్ అవసరం తగ్గి, విమానాశ్రయాల్లో ప్రక్రియ వేగవంతం కానుంది.


