విజయవాడ లబ్బీపేట న్యూస్….
15. 7. 26….( పున్నమి ప్రతినిధి డాక్టర్ మంజుల గుదిమెళ్ళ )
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో గణితశాస్త్ర విభాగం వారు “ప్రాజెక్ట్ వర్క్ ద్వారా పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవడం” (building research skills through project work) అనే అంశంపై అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు.సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (డీమ్డ్ యూనివర్సిటీ) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ch.రామవర ప్రసాద్ గారు విద్యార్థులు ఇలా ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆధారిత పరిశోధనలపై ఎంతో విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. ఈ ఉపన్యాసం విద్యార్థులకు ఎంతగానో సమాచారాన్ని అందించడమే కాకుండా, అత్యంత ఆసక్తిదాయకంగా సాగింది. మరియు విద్యార్థుల నుండి మంచి స్పందనను తెలియజేశారు.
విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమంలో గణిత శాస్త్ర విభాగ అధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.దుర్గావతి.. మరియు అధ్యాపకులు కిరణ్మయి, ,భానుప్రియ, డా.ప్రరూప, జాహ్నవి, తబిత,పుష్ప మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.




