వడదెబ్బతో వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు…వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తూతక లింగన్నపేట గ్రామంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన ఈద అప్పారావు అనే వ్యక్తి (83) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రేకుల షెడ్డు కింద నివసిస్తూ, వడగాల్పులకు మృతి చెందాడు.. ఆదివారం ఐదు గంటల సమయంలో ఇంట్లో మృతి చెందాడు..


