పెన్షన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
బిక్కవోలు, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి):
బిక్కవోలు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను 8 మంది లబ్ధిదారులకు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు.
బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.






