నంద్యాల :జిల్లాలోని 12 పోలీస్స్టేషన్ల పరిధిలోని 15 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 30.276 కేజీల గంజాయిని గురువారం జిల్లా పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. మాదకద్రవ్య నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సమక్షంలో.. కాలుష్య నియంత్రణ, ఎక్సైజ్, పంచాయతీ శాఖల అధికారుల పర్యవేక్షణలో జేఎస్డబ్ల్యూ సిమెంట్ కర్మాగారంలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాషా, ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

30.276 కేజీల గంజాయి ధ్వంసం
నంద్యాల :జిల్లాలోని 12 పోలీస్స్టేషన్ల పరిధిలోని 15 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 30.276 కేజీల గంజాయిని గురువారం జిల్లా పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. మాదకద్రవ్య నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సమక్షంలో.. కాలుష్య నియంత్రణ, ఎక్సైజ్, పంచాయతీ శాఖల అధికారుల పర్యవేక్షణలో జేఎస్డబ్ల్యూ సిమెంట్ కర్మాగారంలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాషా, ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

