ములకలపల్లి మండల కేంద్రంలో చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె అంత్యక్రియల్లో *గౌరవ అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ గారు* పాల్గొని పాడె మోశారు.
శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధలో తాను కూడా భాగస్వామినని తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధుల అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఒక కుటుంబానికి తీరని లోటు ఏర్పడిన ఈ విషాద సమయంలో ఎమ్మెల్యే గారు స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోయడం మానవత్వానికి, ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యతకు నిదర్శనం.
ఊకే శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 🙏🕯️
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆదివాసి నాయకులు,JAC మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు……
ఇట్లు
సోయం నాగరాజు
ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్
Uploaded Video:

