రాజన్న సిరిసిల్ల ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్: మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించారు. మాజీ రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ, టీమ్స్ హాస్పిటల్ సందర్శనకు వెళ్లాల్సిన మాజీ మంత్రి హరీష్ రావును కోకాపేటలో హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
అలాగే నర్సంపేటలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రాచమడుగు సంతోష్ రావు, మెంగాని మనోహర్, శీలం స్వామి, కోడె శ్రీనివాస్, జాంగిర్, శేరయ్య, మీడిదొడ్డి యాదగిరి, పల్లె సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


