రైల్వేకోడూరు: బుడుగుంటపల్లి గ్రామం విద్యానగర్లోని సీతారామస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పంజం వేణుగోపాల్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, సాయికిషోర్రెడ్డి, మాదినేని వెంకట్రెడ్డి, పంజం శ్రీవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, తిరుపతి సూరి తదితరులు పాల్గొన్నారు.








