ఆర్మూర్ పట్టణం జెమ్మన్ జెట్టి గల్లీలో తిరుపతి (పోలీస్ డిపార్ట్మెంట్) అంత్యక్రియలలో ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. తిరుపతి అన్న మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. తిరుపతితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మృతదేహనికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ నర్సయ్య, అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కరాటే భోజన్న, విట్టోబ శేఖర్, దినేష్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.



