*సర్వేంద్రియానం నయనం ప్రధానం..*
*కడివేడులో ఉచిత నేత్ర వైద్య శిబిరం.*
*విద్యార్థులకు హోమియో మందులు పంపిణీ.*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 1 చిల్లకూరు మండలం,*
సర్వేంద్రియానామ్.
నయనం ప్రధానం అన్నట్లు సర్వేంద్రియాలలో అన్నిటికన్నా కన్ను ముఖ్యమైనదని
కల్లపట్ల జాగ్రత్త వహించాలని ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
మంగళవారం చిల్లకూరు మండలం గడివేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ లో కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత ముప్పవరపు వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి పేరిట ఏర్పాటైన ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గ్రామానికి చెందిన దాత ప్రసాద్ ప్రారంభించారు.
ఉపాధ్యాయ బృందం వెంకటేశ్వర ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజల వలన చేసి వారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం నేత్రవైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్య నిపుణుడు వి. రమేష్ శిబిరానికి హాజరైన వారందరికీ కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు.
కంటిలో శుక్లాలు ఉన్నవారికి తిరుపతి వాసన్ ఐ కేర్ ఆసుపత్రి నందు కంటిలో శుక్లాల ఆపరేషన్లు
ఉచితంగా నిర్వహించి వారికి నెలకు సరిపడా మందులు ఇవ్వనున్న ట్లు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
కంటిలో దృష్టిలోపం ఉన్నవారికి అత్యంత తక్కువలకు కంటి అద్దాలు అందజేయన్నామని తెలిపారు.
అనంతరం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు గ్రామస్తులకు ఉపాధ్యాయ సిబ్బందికి చికెన్ ఫాక్స్ సోకకుండా హోమియో మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమూర్తి పాఠశాల దాత ప్రసాద్ మరియు ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.



