శ్రీ కాళహస్తి, జులై 12, (పున్నమి టెంపుల్ న్యూస్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు, ఆదివారం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన కర్ణాటక శాసనమండలి సభ్యుడు, మాజీ రవాణా శాఖ మంత్రి హెచ్.ఎం. రేవణ్ణకు ఆలయ అతిథి గృహం వద్ద ఆత్మీయ స్వాగతం లభించింది. తరువాత ఆయన ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాహు-కేతు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు, బీజేపీ స్థానిక నాయకులు కలిసి స్వామి, అమ్మవార్ల పవిత్ర చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను గౌరవపూర్వకంగా అందజేశారు.

శ్రీకాళహస్తి ఆలయంలో రేవణ్ణ ప్రత్యేక పూజలు
శ్రీ కాళహస్తి, జులై 12, (పున్నమి టెంపుల్ న్యూస్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు, ఆదివారం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన కర్ణాటక శాసనమండలి సభ్యుడు, మాజీ రవాణా శాఖ మంత్రి హెచ్.ఎం. రేవణ్ణకు ఆలయ అతిథి గృహం వద్ద ఆత్మీయ స్వాగతం లభించింది. తరువాత ఆయన ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాహు-కేతు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు, బీజేపీ స్థానిక నాయకులు కలిసి స్వామి, అమ్మవార్ల పవిత్ర చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను గౌరవపూర్వకంగా అందజేశారు.

