జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘జనసేన శంఖారావం’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించనున్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మంలోని రెస్ట్ ఇన్ హోటల్ వేదికగా నిర్వహించనున్నట్లు జనసేన ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జి మిరియాల రామకృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ్ తాల్లూరి, జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డాక్టర్ గడలా శ్రీనివాస రావు, జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి హాజరుకానున్నారు. జనసేన పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలు, రానున్న రోజుల్లో పార్టీ కార్యాచరణ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నట్లు తెలిపారు



