నంద్యాల :రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ రజక సంఘాల నాయకులు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్కు వినతిపత్రం అందజేశారు. సోమవారం నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి తమ డిమాండ్లను విన్నవించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రజకులు ఇప్పటికే ఎస్సీ జాబితాలో ఉన్నారని గుర్తుచేశారు. ఎన్నికల హామీ మేరకు రజకుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక అధ్యయనం చేపట్టి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ధోబి మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా కన్వీనర్ సుబ్రహ్మణ్యం, ఇతర నాయకులు పాల్గొన్నారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి: మంత్రి ఫరూక్కు రజక సంఘాల వినతి
నంద్యాల :రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ రజక సంఘాల నాయకులు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్కు వినతిపత్రం అందజేశారు. సోమవారం నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి తమ డిమాండ్లను విన్నవించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రజకులు ఇప్పటికే ఎస్సీ జాబితాలో ఉన్నారని గుర్తుచేశారు. ఎన్నికల హామీ మేరకు రజకుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక అధ్యయనం చేపట్టి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ధోబి మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా కన్వీనర్ సుబ్రహ్మణ్యం, ఇతర నాయకులు పాల్గొన్నారు.

