నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రజల నుంచి మొత్తం 98 ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలో బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదులపై నిర్దిష్ట గడువులోగా విచారణ చేపట్టి పరిష్కరించాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకూడదని ఎస్పీ ఆదేశించారు. సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పరిష్కరించిన కేసుల వివరాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన: 98 ఫిర్యాదుల స్వీకరణ
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రజల నుంచి మొత్తం 98 ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలో బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదులపై నిర్దిష్ట గడువులోగా విచారణ చేపట్టి పరిష్కరించాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకూడదని ఎస్పీ ఆదేశించారు. సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పరిష్కరించిన కేసుల వివరాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు

