పున్నమి ప్రతినిధి ఆగస్టు 28 రాజన్న సిరిసిల్ల జిల్లా లో నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలు ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆర్ ఎస్ ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ వినియోగించడం వేగంగా మరియు రాంగ్ రూట్లో వానలు నడపకపోవడం డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించకపోవడం మైనర్ డ్రైవింగ్ చేయకపోవడం మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు అని తెలిపారు



