రాజన్న సిరిసిల్ల ఆగస్ట్ 19 (పున్నమి ప్రతినిది )
ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణ
ముస్తాబాద్ మండల కేంద్రంలో క్రేజీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు మాంకాళి వేణు జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రగొల్ల అనిల్, క్యాషియర్లు గొట్టిగళ్ల మధు, నాగరాజు, ప్రధాన కార్యదర్శి మాన్య రాజేష్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఏటా ఆగస్టు 19న ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ కళ, చరిత్ర, సాంకేతికతను గుర్తుచేసుకుంటూ, సమాజంలోని ముఖ్యమైన సంఘటనలను చిత్రాలుగా భద్రపరిచే ఫోటోగ్రాఫర్ల సేవలను గౌరవించేందుకు ఈ రోజును నిర్వహిస్తారు.


