శ్రీ కాళహస్తి, జులై 03 : (పున్నమి న్యూస్) : తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటనను అత్యంత విజయవంతంగా ముగించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతికి తిరుగుప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి గౌరవపూర్వకంగా సాదర వీడ్కోలు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వీడ్కోలు
శ్రీ కాళహస్తి, జులై 03 : (పున్నమి న్యూస్) : తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటనను అత్యంత విజయవంతంగా ముగించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతికి తిరుగుప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి గౌరవపూర్వకంగా సాదర వీడ్కోలు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

