శ్రీ కాళహస్తి, జులై 03 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని 4వ వార్డ్ శాంతి నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అరవ మార్టిన్ ఆకస్మికంగా మరణించారు. సమాచారం అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శనివారం మార్టిన్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. మార్టిన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో పంతులు, డాక్టర్ శంకర్, జయశ్యామ్ రాయల్, నాగమ్మ, మున్నా రాయల్, ముద్దుమూడి రవి, అస్లాం, రాజేంద్ర తదితరులు ఉన్నారు.

రిటైర్డ్ ఉపాధ్యాయుడు మార్టిన్ మృతికి మధుసూదన్ రెడ్డి నివాళి
శ్రీ కాళహస్తి, జులై 03 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని 4వ వార్డ్ శాంతి నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అరవ మార్టిన్ ఆకస్మికంగా మరణించారు. సమాచారం అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శనివారం మార్టిన్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. మార్టిన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో పంతులు, డాక్టర్ శంకర్, జయశ్యామ్ రాయల్, నాగమ్మ, మున్నా రాయల్, ముద్దుమూడి రవి, అస్లాం, రాజేంద్ర తదితరులు ఉన్నారు.

