
★ *మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూ నాయక్ను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని కొంపల్లిలో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న మహబూబాబాద్ మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూ నాయక్ గారిని *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* మర్యాదపూర్వకంగా పరామర్శించారు● ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న *మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు,* తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు, నెహ్రూ నాయక్ గారు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధైర్యం చెప్పారు● ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ యువ నాయకులు గుగులోత్ శ్రీరామ్ నాయక్, గుగులోత్ రఘురాం తదితరులు పాల్గొన్నారు

