తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ ఖమ్మం త్రీటౌన్ గాంధీ బొమ్మ సెంటర్లో బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనాల సాయిరామ్, నకరికంటి వీరభద్రం, పమ్మి అనిత, కొణతం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.



