శ్రీకాళహస్తి, ఏప్రిల్ 29 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) శ్రీనివాస్ నాయక్ కడపకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఏడీజే కోర్టులో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కార్యవర్గం ఆయనకు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికింది.న్యాయవాదులు మాట్లాడుతూ.. శ్రీనివాస్ నాయక్ తన సేవల ద్వారా మంచి పేరు సంపాదించారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముని ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

బదిలీపై ఏడీజే శ్రీనివాస్ నాయక్కు బార్ అసోసియేషన్ ఘన వీడ్కోలు
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 29 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) శ్రీనివాస్ నాయక్ కడపకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఏడీజే కోర్టులో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కార్యవర్గం ఆయనకు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికింది.న్యాయవాదులు మాట్లాడుతూ.. శ్రీనివాస్ నాయక్ తన సేవల ద్వారా మంచి పేరు సంపాదించారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముని ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

