అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛత కమిటీ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సిహెచ్. కేశవరావు ఆదేశాల మేరకు వైస్ ప్రిన్సిపాల్ కె. నిర్మల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఎన్ఎస్ఎస్ పీఓలు వై. విజయలక్ష్మి, ఎం. అనితకుమారి మాట్లాడుతూ పారిశుధ్యం, ప్రజారోగ్యంపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెంపొందించడమే లక్ష్యమన్నారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కళాశాల పరిసరాలను శుభ్రపరిచి, పండ్ల మొక్కలు నాటారు.

ప్రత్యేక పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛత కమిటీ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సిహెచ్. కేశవరావు ఆదేశాల మేరకు వైస్ ప్రిన్సిపాల్ కె. నిర్మల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఎన్ఎస్ఎస్ పీఓలు వై. విజయలక్ష్మి, ఎం. అనితకుమారి మాట్లాడుతూ పారిశుధ్యం, ప్రజారోగ్యంపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెంపొందించడమే లక్ష్యమన్నారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కళాశాల పరిసరాలను శుభ్రపరిచి, పండ్ల మొక్కలు నాటారు.

