రామచంద్రాపురం, ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి
అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేయగలిగామని ఎంపీపీ ఏవీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇది చివరి సమావేశమని, ఇకపై కూడా ఇదే సమన్వయంతో అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీలు, మండల, గ్రామస్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



