**మసీదుబండలో రూ.4 కోట్లతో వరద నీటి కాల్వ**
శేరిలింగంపల్లి డివిజన్ మసీదుబండలో కుడికుంట చెరువు అలుగు నుంచి ప్రభుపాద లేఅవుట్ కాలనీ వరకు రూ.4 కోట్లతో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. కాలనీ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కుడికుంట చెరువు నుంచి వచ్చే అధిక నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.




