పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల కలెక్టరేట్ లోని పాఠశాల విద్యాశాఖ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరీమ అగర్వాల్ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ జిల్లా విద్యాధికారి మొండయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ విలువలు నేర్పి బాధ్యతయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు



