కేంద్రం స్వచ్ఛాంధ్రకు మంజూరు చేసిన 3 వేల కోట్లనువినియోగించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది పరిశుభ్రతకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, పరిశుభ్రమైన నెల్లూరు నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
సంక్షేమం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు… కుటుంబానికి శాశ్వత ఆదాయం వచ్చే అవకాశాన్ని కల్పించడం.అదే దిశగా ప్రభుత్వం తీసుకున్న మరో ముందడుగే ఈ కార్యక్రమం. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాయింట్స్
సిటీ అభివృద్ధికి మంత్రి నారాయణ సార్ అలుపెరగని కృషి చేస్తున్నారు .పేదల సంక్షేమానికి సొంత నిధులు వెచ్చిస్తున్నారు కార్పొరేషన్ పరిధి లోని ప్రభుత్వ స్కూల్స్ లో చదివే పేదపిల్లలకోసం 6 కోట్లతో పదివేల సైకిళ్లు కొనుగోలు చేశారు. 27 వ తేదీ సోమవారం తొలి విడతలో 7 వేల సైకిళ్ళ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
మంచి పనులు చేస్తున్న నారాయణ సార్ కి ప్రజాస్వీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నా.ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత,
,అసిస్టెంట్ కమీషనర్ రేష్మా,
డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి,నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు,కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి,స్థానిక టీడీపీ నేతలు కిన్నెర సాగర్,బాలాజీ,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


