ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సత్యానందరావు
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ లో 13 వినతలు, ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఈ అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కారం చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు.



