పెండింగ్ రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేస్తాం
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వేంపల్లె ప్రాంతంలో పెండింగ్లో ఉన్న ప్రధాన రహదారి పనులను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం వేంపల్లెలో జరుగుతున్న కడప రహదారి పనులను మంత్రి పరిశీలించారు. రహదారి పనుల పురోగతిపై ఆర్అండ్బీ అధికారులతో చర్చించి, పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

