స్థానిక సంస్థల ఎన్నికలకు మరో రెండు నెలల సమయం పడే అవకాశం
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు తదితర కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై స్పష్టత వచ్చిన అనంతరం ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.


