ఖమ్మం, జూలై
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసిన బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు–కర్ణాటక సహ ఇన్చార్జి శ్రీ పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారిని ఖమ్మం బీజేపీ టూ టౌన్ నాయకుడు రుద్రగాని మాధవరావు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు రవి రాథోడ్, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య యాదవ్, పాలేరు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి నున్న రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం టూ టౌన్ ప్రభారి దొంతు జ్వాలా నరసింహారావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మందా సరస్వతి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు తాజ్ నోత్ భద్రం తదితరులు పాల్గొన్నారు. SIR కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.



