పుల్లంపేటలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి.
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం అనాసముద్రం సమీపంలోని కనికరాల దిబ్బ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మృత జింకల మృతదేహాలను గుర్తించి పంచనామా నిర్వహించి దహనం చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం, ఘటనకు సంబంధించిన వివరాలపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


