డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
సెప్టెంబరు 2న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన హోదాకు తగిన విధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాజోలు సీఐ సురేష్బాబు సూచించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ శ్రేణులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి, సఖినేటిపల్లి ఎస్సై దుర్గా శ్రీనివాస్, జనసేన నాయకులు సూరిశెట్టి శ్రీనివాస్, గుండాబత్తుల తాతాజీ, కోళ్ల బాబి తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


