నెల్లూరు: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను గురువారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సీఈవో వసుమతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, జడ్పీ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఈవో సూచించారు. సమావేశాల్లో శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి, ప్రజా సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అధికారులు అవసరమైన నివేదికలు, వివరాలతో హాజరుకావాలని కోరారు.

నెల్లూరు: రేపు జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
నెల్లూరు: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను గురువారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సీఈవో వసుమతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, జడ్పీ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఈవో సూచించారు. సమావేశాల్లో శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి, ప్రజా సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అధికారులు అవసరమైన నివేదికలు, వివరాలతో హాజరుకావాలని కోరారు.

