పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి-బొప్పాపూర్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ గ్రామ పాలకవర్గ సభ్యులు ఆదివారం డస్ట్ పోయించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు



