విజయ నగరం జిల్లా పూసపాటి రేగ మండలానికి చెందిన విశాలాంధ్ర జర్నలిస్ట్ గోవింద్పై జరిగిన హత్యాయత్నాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ పి ఐ అథవాలే) తీవ్రంగా ఖండిం చిందని దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకో వాలని ఆ పార్టీ ఏపి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ చార్జి జ్యోతి జార్జ్, జిల్లా అధ్యక్షుడు ఏకాశి సురేష్ బాబు లు డిమాం డ్ చేశారు.గురువారం నగరం లోని ఆ పార్టీ కార్యాల యంలో వారు విలేకరులతో మాట్లాడా రు.తమ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డా ఎం వెంకట స్వా మి, సౌత్ ఇండియా అధ్యక్షుడు ఎన్ డి అజయ్ ప్రసన్న ఆదేశాల మేరకు ఈ దాడిపై స్పందించం డం జరిగిందని తెలిపారు.జర్నలి స్టుల స్వేచ్ఛ, హక్కులపై దాడుల ను ఏమాత్రం సహించరాదని వారు స్పష్టం చేశారు.ప్రజాస్వా మ్యానికి నాలుగో స్తంభంమైన పాత్రి కేయులపై దాడులు చేయడం అరాచకత్వానికి నిదర్శన మ న్నారు. ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టుల ప్రాణా లకు రక్షణ లేకపోవడం ఆందో ళనకరమన్నారు.జర్నలిస్టు
గోవింద్పై హత్యాయత్నానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి బాధిత జర్నలిస్టుకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాం టి ఘటనలు పున రావృతం కాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఆర్ పి ఐ నేతలు డిమాండ్ చేశారు.


