జనగామ డీసీపీ రాజామహేంద్ర నాయక్కు ఐపీఎస్ హోదా: ఘనంగా సత్కరించిన నెల్లుట్ల ఫౌండేషన్, కవులు కళాకారుల ఐక్యవేదిక
——————————————————————-
జనగామ, ఆగస్టు 31,పున్నమి జిల్లా ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్జోన్ (జనగామ) డీసీపీ బి.రాజామహేంద్ర నాయక్కు ఐపీఎస్ హోదా లభించడం పట్ల స్థానిక సామాజిక, కళా, సాహిత్య సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా సోమవారం డీసీపీ కార్యాలయంలో ఆయనను నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీందర్ రావు, కవులు కళాకారుల ఐక్యవేదిక చైర్మన్ జి.కృష్ణ కలిసి డీసీపీ రాజామహేంద్ర నాయక్ను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనగామ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఐపీఎస్ హోదా లభించడం జనగామ ప్రాంతానికే గర్వకారణమని కొనియాడారు.శాఖపరంగా ఆయన అందిస్తున్న విశిష్ట సేవలతో పాటు, ఇక్కడి కళా, సాహిత్య రంగాలకు అందించిన ప్రోత్సాహం, సహకారానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు నారగోని మూర్తి, టి.మురళీ తదితరులు పాల్గొన్నారు.


