కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో 04-09-2026 న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్, మహిళలకు నెలకు రూ.2500, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ పోరుబాట చేపట్టినట్లు మాజీ కార్పొరేటర్ కె. జగన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.


