కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్రెడ్డి నకిరేకల్ సభలో ఘాటుగా స్పందించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తమ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకోవాలని సవాల్ చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉద్యోగాల కల్పన వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ లెక్కలపై చర్చించాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

కేసీఆర్కు రేవంత్ సవాల్.. అసెంబ్లీకి రా.. లేదంటే రాజీనామా చేయి!
కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్రెడ్డి నకిరేకల్ సభలో ఘాటుగా స్పందించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తమ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకోవాలని సవాల్ చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉద్యోగాల కల్పన వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ లెక్కలపై చర్చించాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

