విశాఖపట్నంజిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 22 ::
స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, విశాఖపట్నంలో నిర్వహించిన 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో పెందుర్తి ప్రగతి ఒకేషనల్ జూనియర్ కాలేజీ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని బొద్దపు జోత్స్నా (MPHW) అండర్ 18 కటా. విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించింది.
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చాటి సిల్వర్ మెడల్ సాధించడం పట్ల జోత్స్నాను పలువురు అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు.
“పట్టుదలతో సాధన చేస్తే విజయం మనదే” అనే నమ్మకంతో ముందుకు సాగుతున్న జోత్స్నా భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 🥈🥋






