ఏఎస్పేట: మండల కేంద్రంలో ఉదయం వేళల్లోనే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని బెల్ట్ షాపుల ద్వారా తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలకు నిర్ణీత సమయాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వాటిని పట్టించుకోకుండా అక్రమంగా విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఉదయం వేళల్లోనే మద్యం అందుబాటులోకి వస్తుండటంతో యువత, కార్మిక వర్గాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉదయం వేళల్లో జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, వాస్తవాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఉదయం నుంచే మద్యం విక్రయాలు.. ఏఎస్పేటలో బెల్ట్ షాపుల జోరు
ఏఎస్పేట: మండల కేంద్రంలో ఉదయం వేళల్లోనే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని బెల్ట్ షాపుల ద్వారా తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలకు నిర్ణీత సమయాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వాటిని పట్టించుకోకుండా అక్రమంగా విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఉదయం వేళల్లోనే మద్యం అందుబాటులోకి వస్తుండటంతో యువత, కార్మిక వర్గాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉదయం వేళల్లో జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, వాస్తవాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

