ఆహార ఉత్పత్తులను విక్రయించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా FSSAI రిజిస్ట్రేషన్ లేదా సర్టిఫికెట్ కలిగి ఉండాలని జిల్లా ఆహార భద్రత అధికారి ఈ. శరత్ తెలిపారు. గురువారం ఖమ్మం నగరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్న వ్యాపారులు FSSAI రిజిస్ట్రేషన్, పెద్ద వ్యాపారులు లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా ఆహార వ్యాపారం నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మంలోని వేర్హౌస్లలో మిర్చి నిల్వ చేసే సమయంలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యమన్నారు.



