మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామంలో శుక్ర వారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విడ్స్ కౌన్సిలర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాల నిర్వహణ, పొదుపు ప్రాధాన్యం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై), కేవైసీ, రీ-కే వైసీ ప్రక్రియలతో పాటు బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల రుణ సదుపాయాలపై గ్రామస్తులకు వివరించారు. అవగాహన కార్యక్రమంలో బాలకృష్ణ
బ్యాంకు సేవలు, పొదుపు అలవాట్లు, బీమా పథకాల ప్రయోజనాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే లా వివరించారు. ఈ కార్యక్రమంలో సిసి,విఓఏ, మహిళలు,ప్రజలు పాల్గొన్నారు.



