Sunday, 23 August 2026
  • Home  
  • అసైన్మెంట్‌ భూముల జీవో 22 రద్దు చేయాలి అనే డిమాండ్ తో నేడు కలెక్టర్ఖ కి వినతి పత్రం అందజేయనున్న ఖమ్మం జిల్లా బిజెపి నేతలు.
- ఖమ్మం

అసైన్మెంట్‌ భూముల జీవో 22 రద్దు చేయాలి అనే డిమాండ్ తో నేడు కలెక్టర్ఖ కి వినతి పత్రం అందజేయనున్న ఖమ్మం జిల్లా బిజెపి నేతలు.

అసైన్మెంట్‌ భూముల రెగ్యులేషన్‌కు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీసుకొచ్చిన జీవో నంబర్‌ 22ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ మేరకు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. అసైన్మెంట్‌ భూముల విషయంలో రైతులు, పేదలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

అసైన్మెంట్‌ భూముల రెగ్యులేషన్‌కు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీసుకొచ్చిన జీవో నంబర్‌ 22ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ మేరకు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. అసైన్మెంట్‌ భూముల విషయంలో రైతులు, పేదలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.